అలాంటి జగన్‌కు అవే ఆలోచనలు.. లోకేశ్ చురకలు?

Chakravarthi Kalyan
ముఖ్యమంత్రి కాకముందు 16నెలలు నేరస్థుల మధ్య గడిపిన జగన్ నుంచి మంచి ఆలోచనలు ఎక్స్‌పెక్ట్‌ చేయలేమంటూ నారా లోకేశ్ జగన్‌పై విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో దాదాపు 800 మంది మహిళలపై దారుణాలు జరిగితే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ఆయన ప్రశ్నించారు. అత్యాచారాలు చేసిన వైసీపీ నేతలకు మహిళా కమిషన్ ఏనాడైనా నోటీసులు ఇచ్చిందా...అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నిస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి డోలాస్ నగర్ ప్రాంతంలో నారా లోకేష్ పర్యటించారు.

లోకల్ ఎమ్మల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూలగొట్టించిన ఇళ్లను బాధితులతో కలసి నారా లోకేశ్   పరిశీలించారు. మహిళలపై దాడులు చేసిన వారంతా స్వేచ్ఛగా బయట తిరుగుతుంటే ఏనాడైనా కమిషన్ ప్రశ్నించిందా అని నారా లోకేశ్ నిలదీశారు. బాధితులకు అండగా నిలవడం తాము చేసిన తప్పా అని నారా లోకేశ్ ప్రశ్నించారు. మాఫియారాజ్ ప్రభుత్వం ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. గుడివాడలో కాసినో నిర్వహించిన వారిపై చర్యలు తీసుకోకుండా అన్యాయాన్ని అడ్డుకున్న అధికారులపైనే కేసులు పెడతారా అని లోకేష్ ఎదురు దాడి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: