కరోనాపై WHO చీఫ్ సైంటిస్ట్ షాకింగ్ కామెంట్స్?
వివిధ ప్రాంతాల్లో కరోనా వైరస్ వివిధ రకాలుగా ప్రవర్తిస్తోందని సౌమ్య స్వామినాథ్ తెలిపారు. అందుకే కొత్త వేవ్ ల విజృంభణను అర్థం చేసుకోలేకపోతున్నామని సౌమ్య స్వామినాథ్ పేర్కొన్నారు. కరోనా వేరియంట్లను ఎదుర్కొనేందుకు ఒకే రకమైన టీకా రావాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ చీఫ్ సైంటిస్ట్ అంటున్నారు. ఇప్పటికే కొవిడ్ కు సంబంధించి భారీ స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నందున వచ్చే రెండేళ్లలో ఇది సాధ్యం కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు