ఏపీ రైతుల ఖాతాల్లో సీఎం జగన్ నగదు వేయబోతున్నారు. ఇప్పటి వరకూ రైతు బీమా సొమ్ములు రైతుల ఖాతాల్లో పడుతున్నాయి. కానీ ఇప్పుడు ఆ డబ్బు కాదు.. మరో డబ్బులు జగన్ వేయబోతున్నారు. అయితే.. ఈ డబ్బుతో పెద్దగా రైతులుకు ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే.. ఇప్పుడు వేయబోయే డబ్బులు విద్యుత్ బిల్లుల కోసం వేస్తారట. ఇకపై ఉచిత విద్యుత్ డబ్బు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ఈ డబ్బును రైతులే డిస్కంలకు చెల్లిస్తారు. దీనివల్ల విద్యుత్ సేవలకు సంబంధించి రైతులు ప్రశ్నించగలుగుతారని ప్రభుత్వం భావిస్తోంది. అయితే.. ఇలా చేయడం వల్ల సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. రైతుల ఖాతాల్లో డబ్బులు పడిన తర్వాత దాన్ని విద్యుత్ బిల్లుల కోసమే వాడాలని రూల్ ఏమీ ఉండదు కదా. డబ్బు వచ్చాక అది ఎలాగైనా ఖర్చు కావచ్చు. ఆ తర్వాత బిల్లు కట్టలేదని రైతుల పైపు సెట్లకు కరెంట్ కట్ చేసే పరిస్థితులు కూడా రావచ్చంటున్నారు నిపుణులు.