విశాఖ పోర్టు ఏపీ ఖ్యాతిని పెంచుతోంది. ఎగుమతుల్లో కీలక పాత్ర పోషిస్తోంది. గత రెండేళ్లలో విశాఖ పోర్టు నుంచి వివిధ దేశాలకు గోధుమలు ఎగుమతి జరుగుతోంది. గత ఏడాది విశాఖ పోర్ట్ నుంచి 1 .7మిలియన్ టన్నులు వరి ఎగుమతి చేశారు. గోధుమ ఎగుమతి పెంచడానికి 200 కోట్లతో నూతన గోదాములు నిర్మాణం చేశారు. నిరంతరాయ గోధుమ ఎగుమతి కృషి చేశారు. పాత గోదాములు కూడా బాగు చేసి గోధుముల ఎగుమతి కోసం సిద్ధం చేసారు. ఒక్క విశాఖ పోర్ట్ నుంచి రానున్న రోజులో నలబై మిలియన్ డాలర్ విలువ గలిగిన ఎగుమతులు జరగడానికి ఆస్కారం ఉంది.
రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ వ్యాప్తంగా గోధుమలు డిమాండ్ పెరిగింది. మన దేశం నుంచి గోధుమలు ఎగుమతి జరుగుతోంది. విశాఖ పోర్ట్ నుంచి నిరంతరాయంగా గోధుమలు విదేశాలకు వెళ్తోంది. ఇది వాణిజ్య పరంగా, వ్యవసాయ పరంగా దేశానికి మేలు చేస్తోంది.