పీకల్లోతు కష్టాల్లో పాకిస్తాన్..దివాలా తీసినట్టేనా?
ఈ మొత్తం.. పాకిస్తాన్ దేశం చేసుకునే దిగుమతులన్నటికీ రెండు నెలల చెల్లింపులకు మాత్రమే సరిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే ఈ నిధులను పొదుపుగా వినియోగించే ప్రయత్నంలో భాగంగా గత నెలలో లగ్జరీ వస్తువుల దిగుమతిని ప్రభుత్వం నిలిపివేసింది. కేవలం నిత్యావసర వస్తువులనే దిగుమతి చేసుకోవాలని పాక్ నిబంధన విధించింది. అలాగే విద్యుత్ను ఆదా చేసేందుకు వ్యాపారాలు, దుకాణాలు, స్టాల్స్ను రాత్రి 8.30కు మూసేయాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది.