తెలుగుదేశంలో చేరిన పారిశ్రామిక వేత్త?
చంద్రబాబు ను ముఖ్యమంత్రి గా చూడటమే మా లక్ష్యమని గంటా నరహరి అన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందని.. మళ్ళీ అభివృద్ధి జరగాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలని గంటా నరహరి అన్నారు. ఈ చేరిక కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డితో పాటు మరో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. తటస్థులు తెలుగు దేశం పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.