కేఏ పాల్‌ కొత్త డైలాగ్‌.. అద్దిరిపోయిందిగా?

Chakravarthi Kalyan
కేఏ పాల్.. మొన్నటి వరకూ మత ప్రచారకర్త.. ఇప్పుడు ఆయన సీరియస్ పొలిటీషియన్‌గా మారిపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజాశాంతి పార్టీ అధినేతగా ఆయన త్వరలో ప్రజాయాత్రలు చేయబోతున్నారు. ఈ యాత్ర ద్వారా పలు విషయాలు ప్రజలతో పంచుకుంటారట.  పేదరికం, అవిద్య, నిరుద్యోగం ప్రజలను తీవ్రంగా పీడిస్తున్నాయంటున్న ప్రజాశాంతి పార్టీ వ్యవస్ధాపకులు కెఎ పాల్.. లక్షల కోట్ల రూపాయిలు అప్పులు చేస్తూ ప్రభుత్వాధినేతలు ప్రజలపై తీవ్ర రుణభారం మోపుతున్నారని విమర్శించారు.

అందుకే కేఏ పాల్‌ కొత్త డైలాగ్‌ పాపులర్ చేస్తున్నారు. ఆ డైలాగ్ ఏంటో తెలుసా.. పాల్ రావాలి పాలన మారాలి.. ఈ యాత్రలో ఈ నినాదాన్ని బాగా పాపులర్ చేస్తారట. విశాఖలో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్.. ప్రజలు ప్రస్తుత నేతల పాలనతో పూర్తిగా విసిగి పోయారన్నారు. గతంలో తాను తెలుగురాష్ట్రాలలో అభివృద్దికి బాటలు వేసే కీలకమైన పెట్టుబడులు పెట్టేవారిని తీసుకువచ్చానని గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: