కేసీఆర్‌ నక్క..? మోడీ నాగలోకం..?

Chakravarthi Kalyan
తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్న ప్రెస్ మీట్‌ పెట్టి మోడీ పై ఘాటుగా విమర్శలు గుప్పించారు. దేశంలో మోడీ అంత అసమర్థ పీఎం  ఎవరూ లేరని విమర్శించారు. అందుకు కొన్ని కారణాలు వివరించారు. అయితే.. మోడీని అంత మాట అంటే బీజేపీ వాళ్లు ఊరుకుంటారు. కేసీఆర్‌ ప్రెస్ మీట్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు.


కోన్ కిస్కా గొట్టం కేసీఆర్ కు ప్రధాని మోదీ సమాధానం చెప్పాలా అని బండి సంజయ్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ప్రశ్నలకు మెదట కేసీఆర్ సమాధానం చెప్పాలని.. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ వేగంగా పెరుగుతుందని... టీఆర్ఎస్ గ్రాఫ్ అంతే వేగంగా పడిపోతుందని బండి సంజయ్ అన్నారు. మేము నోరు విప్పితే కేసీఆర్ కు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలియదన్న బండి సంజయ్.. సొంత ప్రభుత్వ అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్ళించడానికే కేసీఆర్ మోడీపై  విమర్శలు చేస్తున్నారన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: