నేడే రాష్ట్రపతి ఎన్నికల రిజల్ట్స్: ముర్ముదే పీఠం?
ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలో ఉన్నారు. అలాగే రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీలో ఉన్నారు. లెక్కింపు మొత్తం పూర్తయ్యాక తుది ఫలితం ప్రకటిస్తారు. ఈనెల 24తో ప్రస్తుత రాష్ట్రపతి కోవింద్ పదవీకాలం ముగుస్తుంది. ఈనెల 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. తమ అభ్యర్థి ద్రౌపది ముర్ము అంచనాలను మించి మెజార్టీ సాధిస్తారని బీజేపీ ధీమాగా ఉంది.