శ్రీలంక అధ్యక్ష భవనంలో భారీ చోరీ?
ఆ సమయంలో శ్రీలంక అధ్యక్ష భవనంలో దాదాపు వెయ్యి వరకు కళాఖండాలు మాయమయ్యాయట. ఈ మేరకు తాజాగా పోలీసులు తెలిపారు. వీటిలో పలు పురాతన వస్తువులు కూడా ఉన్నాయట. ఈ దొంగతనాలపై దర్యాప్తు కోసం ఇప్పుడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే.. అధ్యక్ష భవనంలో ఉన్న చారిత్రక ప్రాధాన్య వస్తువుల గురించి పూర్తి వివరాలు అందుబాటులో లేవట. అందుకే కచ్చితమైన లెక్కలు తేలడం లేదట. ఈ విషయాన్ని పురావస్తుశాఖ సీనియర్ అధికారి చెప్పారు.