చైనా నిర్ణయంతో పాకిస్తాన్ ఖుషీ ఖుషీ?
ఇలా చైనా చేయడం గత రెండు నెలల్లో ఇది రెండోసారి. జూన్లో లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే ప్రతిపాదనను కూడా చైనా చివర్లో అడ్డుకుంది. అంత క్రితం జేషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ను ఈ జాబితాలో చేర్చేందుకు భారత్ ప్రతిపాదించినా చైనా ఇలాగే అడ్డుపడింది. కానీ.. చివరకు అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో చైనా వెనక్కి తగ్గింది. అజార్ను 2019లో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించింది.