శభాష్ కేజ్రీవాల్.. దేశంలోనే ఫస్ట్ వర్చువల్ స్కూల్?
చేపట్టింది. 9 నుంచి 12వ తరగతి వరకూ ఈ వర్చువల్ పాఠశాలలో పాఠాలు చెబుతారు. 13 నుంచి 18 ఏళ్ల వయసున్న విద్యార్థులు వర్చువల్ బడిలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అంతే కాదు.. నీట్, సీయూఈటీ, జేఈఈ వంటి పరీక్షలకు కూడా ఈ వర్చువల్ పాఠశాలలో నిపుణులతో శిక్షణ ఇస్తారు. దేశంలో అనేక కారణాలతో చాలా మంది పిల్లలు బడికి వెళ్లలేకపోతున్నారు. బాలికలను దూరం పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడడంలేదు. అలాంటి వారందరికీ ఈ వర్చువల్ స్కూల్ ఓ వరం అనే చెప్పాలి. ఈ స్కూల్ తరగతులు ఆన్లైన్లోనే జరుగుతాయి. ఉపాధ్యాయులు బోధించే వీడియోలను ఆన్లైన్ అప్లోడ్ చేస్తారు. ఈ వర్చువల్ స్కూల్ దిల్లీ బోర్డు ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు అనుబంధంగా పనిచేస్తుంది.