జగనన్నా.. ఈ అసభ్యకరమైన పోస్టులు ఏంటన్నా?
పులివెందులకు చెందిన వర్రా రవీందర్ రెడ్డి.. తెలుగుదేశం పార్టీ మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని.. అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని అనూష మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ అనుమతి లేకుండానే వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు ఇలా వ్యవహరిస్తున్నారా అని ఉండవల్లి అనూష ప్రశ్నించారు. మహిళలను అక్కచెల్లెమ్మలుగా సంబోధించే జగన్ రెడ్డికి ప్రతిపక్ష పార్టీ మహిళలు మహిళలుగా కనిపించడం లేదా అని ఉండవల్లి అనూష ప్రశ్నించారు.