ఏపీలో మరో నాయకుడి పాదయాత్ర ?
జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడి మండలం సోమవరం నుంచి జ్యోతుల నవీన్ పాదయాత్ర ప్రారంభించారు. పాదయాత్రలో టీడీపీ శ్రేణులతోపాటు స్థానికులు భారీగా పాల్గొన్నారు. నిత్యావసరాలు, గ్యాస్, పెట్రో, ఇసుక, విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచేశారని.. పేదలపై పెను భారం వేశారని నవీన్ అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని నవీన్ విమర్శించారు. గురువారం రెండో రోజు కిర్లంపూడి మండలంలోని సోమరాయంపేట, పాలెం, గోనెడ గ్రామాల్లో పాదయాత్ర చేయనున్నారు.