ప్రకృతి వ్యవసాయానికి టీటీడీ అండ!
గతేడాది శనగలు కొనుగోలు చేశారు. ఈ ఏడాది నుంచి 12 రకాల దాన్యాలను కొనుగోలు చేయనున్నట్లు రైతుసాధికార సంస్ధ ముఖ్యకార్యదర్శి విజయ్ కుమార్ తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిదారులకు, తితిదేకి మధ్యవర్తిగా మార్క్ ఫెడ్ వ్యవహరిస్తోంది. దీని ద్వారా రైతులకు సకాలంలో డబ్బులు అందుతున్నాయి. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, రైతు సాధికార సంస్ధ ముఖ్యకార్యదర్శి విజయ్ కుమార్, మార్క్ ఫెడ్ ఎండీ ప్రద్యుమ్న పాల్గొన్నారు.