రెచ్చిపోయిన ఏనుగు.. ఎంత ఘోరం చేసిందంటే?

Chakravarthi Kalyan
పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం జరిగింది. ఏనుగు దాడిలో ఓ మృతి చెందాడు. కొమరాడ మండలం కల్లికోట గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. గుంపులో నుంచి విడిపోయిన ఓ నే ఏనుగు కల్లికోట గ్రామ సమీపంలో దాసరి గోవింద అనే రైతు పై దాడి చేసింది. శుక్రవారం రాత్రి ఈ దాడి జరిగింది.


పొలానికి నీరు పెట్టాడానికి వెళ్తూ రైతు ఏనుగు దాడికి గురయ్యాడు. ఏనుగు దాడిలో తీవ్రంగా గాయపడిన గోవింద అక్కడికక్కడే మృతి చెందింది. ఇప్పటికి ఈ ప్రాంతంలో ఏనుగులు కొన్నేళ్లుగా ప్రజలను హడలెత్తిస్తున్నాయి. ఇప్పటికి ఈ ప్రాంతంలో ఏనుగుల దాడిలో చనిపోయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. ప్రస్తుతం గరుగుబిల్లి మండలం ఖడ్గవలసలో మిగిలిన ఏడు ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇకనైనా అధికారులు ఈ ఏనుగుల గుంపులను అదుపు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని.. వేడుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: