మళ్లీ ఇప్పటం గ్రామానికి పవన్.. ఎందుకంటే..?
ఆ పరిహారాన్ని స్వయంగా అందించేందుకు పవన్ కళ్యాణ్ వస్తున్నారు. ఆయనే స్వయంగా ఇప్పటం వెళ్లి పరిహారం అందించే అవకాశం లేకపోతే... బాధితులను మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పిలిపించి పరిహారం అందిస్తారు. పవన్ పరిహారం ప్రకటించిన తర్వాత తమకు అవేమీ వద్దని వైసీపీకి చెందిన కొందరు ఫ్లెక్సీలు కట్టారు కూడా. దీంతో పరిహారం ఎందరికి ఇవ్వాలనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఎవరైతే పరిహారం తీసుకునేందుకు అంగీకరిస్తారో వారికి ఇవ్వాలని జనసేన భావిస్తోంది.