ఆదుకో.. జగనన్నా.. ఆక్వాను ఆదుకో..?
అర్థం కాని విధంగా రైతులపై విద్యుత్ బిల్లులు భారం మోపుతున్నారని ఆక్వా రైతులు అంటున్నారు. ఆక్వా మేతకు కీలకమైన సోయా ధర తగ్గుతుంటే..., మేత ధరలు పెరగుతోందన్నారు. గతంలో 30వేలు వచ్చే విద్యుత్ బిల్లు, ఇప్పుడు లక్షల్లో వస్తోందంటున్నారు. రొయ్యల్ని కొనే నాథులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్ ఫార్మర్లకు డబ్బులు వసూలు చేస్తున్నా సరైన సమయానికి విద్యుత్ ఇవ్వట్లేదని బాధపడుతున్నారు. ఆక్వా ఫీడ్ భారీగా పెరిగిపోవటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జగన్ ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.