పెద్దనోట్ల రద్దు కేసు.. మోదీకి షాక్ తప్పదా?

Chakravarthi Kalyan
పెద్ద నోట్ల రద్దు కేసులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2016లో మోదీ ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇది అంతగా సత్ఫలితాలు ఇవ్వలేదన్న వాదనలు ఉన్నాయి. దీనిపై సుప్రీంకోర్టులో కేసు దాఖలైంది. ఈ పెద్దనోట్ల రద్దుకు సంబంధించిన ఫైళ్లు తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని, ఆర్బీఐని ఆదేశించింది. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాలపై విచారణను ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

ఈ కేసులో కక్షిదారులంతా తమ వాదనలను లిఖితపూర్వకంగా ఈనెల 10లోగా సమర్పించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేంద్రం తరఫున సీల్డు కవర్ లో రికార్డులు సమర్పిస్తామని అటార్నీ జనరల్  వెంకటరమణి తెలిపారు. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా మొత్తం 58 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుప్రీం ధర్మాసనం సుదీర్ఘంగా వాదనలు విన్నది. ఆర్థిక విధాన వ్యవహారాల్లో న్యాయసమీక్షకు అవకాశాలు పరిమితంగానే ఉన్నా.. కోర్టు చేతులు కట్టుకొని కూర్చోబోదని సుప్రీం ధర్మాసనం చెప్పడం ఉత్కంఠకు దారి తీస్తోంది. మరి తుది తీర్పు ఎలా ఉంటుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: