కరోనా మళ్లీ ముంచుకొస్తోందా.. కేంద్రం వార్నింగ్?
జీనోమ్ సీక్వెన్సింగ్తో కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించవచ్చన్న కేంద్రం... ప్రస్తుతం దేశంలో వారానికి 1200 కొవిడ్ కేసులు వస్తున్నాయని తెలిపింది. అయితే.. ప్రపంచవ్యాప్తంగా వారానికి 35 లక్షల కొవిడ్ కేసులు నమోదు అవుతున్న దృష్ట్యా అంతా అప్రమత్తం కావాలని కేంద్రం సూచించింది. కరోనా విజృంభణ దృష్ట్యా భారత్లోనూ అప్రమత్తత అవసరమంటూ కేంద్రం హెచ్చరించింది. ఇప్పటికే చైనాలో కరోనా మరణ మృదంగం మొదలైంది. అక్కడ రోజూ వందల మరణాలు చోటుచేసుకుంటున్నట్టు తెలుస్తోంది.