జగన్ పించన్ల సొమ్ములో నకిలీ నోట్ల గోల?
జనవరి 1వ తేదీ ఆదివారం సెలవు రోజు అయినా తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పెరిగిన పింఛను డబ్బులు అందించారు. ప్రభుత్వం శనివారమే అన్ని గ్రామ, వార్డు సచివాలయ శాఖల ఖాతాల్లో రూ.1,765 కోట్ల నిధులు జమ చేసింది. అయితే.. ఇలా ఇస్తున్న నోట్లలో కొన్ని నకిలీవి రావడం కలకలం రేపుతోంది. రెండు, మూడు జిల్లాల్లో ఈ పరిస్థితి ఎదురైంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి.