నెలలో రూ. లక్షా 40 వేల కోట్లు.. మోదీ కలెక్షన్ సూపర్?
సెంట్రల్ జీఎస్టీ ద్వారా 26వేల 7వందల 11 కోట్లు వసూలు అయ్యాయి. అలాగే స్టేట్ జీఎస్టీ వసూళ్ల ద్వారా 33వేల 3వందల 57 కోట్లు వచ్చాయి. ఇవి కాకుండా ఐ జీఎస్టీ ద్వారా 78వేల 4వందల 34 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2021 డిసెంబర్తో పోలిస్తే జీఎస్టీ గణనీయంగా పెరిగాయి. గతేడాదితో పోలిస్తే వస్తువుల దిగుమతి ఆదాయం 8శాతం, దిగుమతి సేవల రాబడి 18శాతం పెరిగినట్లు కేంద్రం లెక్కలు చెబుతున్నాయి.