ఆ పని చేస్తే.. మళ్లీ జగన్‌ దే అధికారం..?

Chakravarthi Kalyan
వైసీపీలో అంద‌రం క‌లిసిక‌ట్టుగా ప‌ని చేస్తే మ‌ళ్లీ మ‌న‌దే అధికార‌మ‌ని మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌ రెడ్డి అంటున్నారు. పాద‌యాత్రలో ప్రజ‌ల క‌ష్టాలు క‌ళ్లారా చూసిన వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల మేనిఫెస్టోలో పొందుప‌రిచిన అంశాల్లో ఇప్పటికే 98 శాతం హామీలు నెరవేర్చామని మాజీ మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌ రెడ్డి గుర్తు చేశారు. అన్ని వ‌ర్గాలకు మేలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఒక్కరేనని బాలినేని శ్రీ‌నివాస‌ రెడ్డి అన్నారు.


వైయ‌స్ జ‌గ‌న్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల‌తో ల‌బ్ధిపొందిన ప్రతి ఒక్కరిని గడప గడపకు మ‌న ప్రభుత్వం కార్యక్రమం ద్వారా క‌ల‌వాల‌ని  బాలినేని శ్రీ‌నివాస‌ రెడ్డి సూచించారు. సంక్షేమ ప‌థ‌కాల‌పై విస్తృతంగా ప్రచారం చేయాల‌ని సూచించిన  బాలినేని శ్రీ‌నివాస‌ రెడ్డి.. విప‌క్షాల త‌ప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల‌ని పిలుపునిచ్చారు.  చిన్న చిన్న సమస్యలు, మనస్పర్థలు ఉన్నా మనసులో పెట్టుకోకుండా పార్టీ విజ‌యానికి అంతా సహకరించాలని శ్రీ‌నివాస‌ రెడ్డి కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: