అమ్మాయిలతో వలవేసి.. లక్షలు కాజేసి..?
పారిశ్రామిక వేత్తలు హోటళ్లకు వచ్చిన తర్వాత ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడతారు. వారు మహిళలతో ఉండగా గదిలోకి ప్రవేశించి డమ్మీ తుపాకులతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన నిందితుడు వికార్ మెహదీ హోంగార్డుగా డిస్మిస్ అయిన తర్వాత ఈ దందాలకు పాల్పడుతున్నాడు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు 4బృందాలను ఏర్పాటు చేసి నిందితులను పట్టుకున్నారు. ఈ ముఠా ఇప్పటి వరకు 8.5లక్షల వరకు బాధితుల నుంచి దోచుకుంది. వీరిపై విచారణ జరిపి పీడీ యాక్టు నమోదు చేయనున్నారు.