కబ్జారాయుళ్లు: రజకుల దోభీఘాట్ కూడా వదలరా?
దోబీఘాట్ కబ్జాకు గురి కాకుండా కాంపౌండ్ వాట్ నిర్మించేందుకు ఎంపీ నిధులు తెస్తామని ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇంఛార్జి మల్ రెడ్డి రామిరెడ్డి అంటున్నారు. ఇప్పటికే ఆ స్థల రక్షణకు ఎంపీ రేవంత్ రెడ్డి అయిదు లక్షలు తమ ఎంపీ ల్యాడ్స్ ద్వారా ఇచ్చారని తెలిపారు. జీహెచ్ఎంసీ అధికారులు ఇంతవరకు అంచనావేయడం లేదట. ఆ స్థలం ఎట్టి పరిస్థితుల్లోనూ కబ్జాకాకుండా చూస్తామని చెబుతున్న కాంగ్రెస్ నేత రామిరెడ్డి....కాంపౌండ్ వాల్ నిర్మాణానికి ఎంత ఖర్చయినా అందుకు అయ్యే మొత్తం ఎంపీ ల్యాడ్స్ నుంచి ఇప్పిస్తానన్నారు.