కేసీఆర్‌.. ఆ సంస్థలపై విశ్వాసం లేకపోతే ఎలా?

Chakravarthi Kalyan
ఎమ్మెల్యేల ఎర కేసులో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నతీరు సరియైనది కాదని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. ప్రభుత్వంలో ఉన్న వారికే విచారణ సంస్థలపై విశ్వాసం లేకపోతే ప్రజల పరిస్థితి ఏమిటని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్‌ దర్యాప్తును రద్దు చేసి సీబీఐకి అప్పగిస్తూ సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును డివిజన్‌ బెంచ్‌ కూడా సమర్ధించిందని జి.నిరంజన్‌  అన్నారు. దీనిపై తిరిగి సుప్రీం కోర్టులో సవాల్‌ చేయడం అంటే.. దేశంలోని విచారణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసినట్లేనని జి.నిరంజన్‌  ఆరోపించారు.

ఎమ్మెల్యేల ఎర కేసులో సిట్‌ ను ఏర్పాటు చేయడం, దేశ వ్యాప్తంగా న్యాయమూర్తులకు వీడియోలు పంపడం, లేఖలు రాయడం వివాదస్పదంగా మారాయని.. రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ దర్యాప్తు సంస్థలైతేనే నిష్పక్షపాతంగా చేస్తాయని...కేంద్ర దర్యాప్తు సంస్థలైతే చేయవన్నఅభిప్రాయంతో ఉంటే సామాన్య ప్రజలకు దిక్కెవ్వరని జి.నిరంజన్‌  ప్రశ్నించారు. రాష్ట్ర పోలీసు, నిఘా వ్యవస్థ, అవినీతి నిరోధక శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయబద్దంగా పని చేస్తామన్ననమ్మకం ఏమిటని జి.నిరంజన్‌  ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఖరిని మార్చుకుని దర్యాప్తు సంస్థల ప్రతిష్టను, విశ్వసనీయతను పరిరక్షించాలని జి.నిరంజన్‌  డిమాండ్‌ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR

సంబంధిత వార్తలు: