టీఎస్‌పీఎస్సీ.. ఆ పరీక్ష తేదీ మార్చండి ప్లీజ్‌..?

Chakravarthi Kalyan
డివిజన్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్ష తేదీని మార్పు చేయాలని హైదరాబాద్ నాంపల్లిలోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ కు భారతీయ జనతా యువ మోర్చా నేతలు వినతి పత్రం ఇచ్చారు. ఫిబ్రవరి 26 తేదీన పలు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన పరీక్షలు.. ఒకే రోజు ఉండటం వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగులు, అభ్యర్థులు అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఉందని భారతీయ జనతా యువ మోర్చా నేతలు తెలిపారు.

26న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష, కేంద్రీయ విద్యాలయ సంఘటన్, ఎయిర్ పోర్ట్ ల నియామక పరీక్షలకు... దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులు, అభ్యర్థులు అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఉందని భారతీయ జనతా యువ మోర్చా నేతలు అన్నారు. ఈ పరిస్థితి దృష్ట్యా పరీక్ష తేదీని మార్పు చేయాలని చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: