మూడు రాజధానులు కాదు.. విశాఖ ఒక్కటే?
విభజన తర్వాత పాలనా రాజధానిగా విశాఖనే ఎంచుకోవడానికి కారణం అతి తక్కువ వ్యయంలో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయనేనని మంత్రి బుగ్గన తెలిపారు. మరింతగా అభివృద్ధి చెందేందుకూ విశాఖలో అవకాశం ఉందని మంత్రి బుగ్గన అన్నారు. విశాఖ వాతావరణంతో పాటు పోర్టులు, పరిశ్రమలు ఉన్నాయి కాబట్టే విశాఖను రాజధానిగా ఎంచుకున్నామని మంత్రి బుగ్గన వివరించారు. కర్నూలు రాజధాని కాదని.. హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నాం అంతేనని.. గుంటూరులోనూ అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేయాలన్నది తమ నిర్ణయమని మంత్రి బుగ్గన తెలిపారు.