జీహెచ్ఎంసీలో అధికారులు, కార్పొరేటర్ల మధ్య రగడ రాజుకుంది. అధికారులతో కార్పొరేటర్లు మర్యాదగా ప్రవర్తించాలని.. లేని పక్షంలో అధికారులుగా సహకరించమని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షురాలు, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ మమత అంటున్నారు. బిజెపి కార్పొరేటర్లు అధికారుల పట్ల అనుచిత ధోరణికి నిరసనగా కౌన్సిల్ సమావేశాన్ని బహిష్కరించామని ఆమె తెలిపారు. జలమండలి కార్యాలయం వద్ద బీజేపీ కార్పొరేటర్లు ఎటువంటి సంస్కారం పద్ధతి లేకుండా అధికారుల కార్యాలయం చాంబర్లో సిల్ట్ వేశారని.. అధికారులపై అనుచితంగా మాట్లాడా