అప్పుడు ఆంధ్రావాళ్లు దొంగలన్నారు.. ఇప్పుడు?
గతంలో ఆంధ్ర నాయకులు దొంగలన్న కేసీఆర్.. ఇప్పుడు అన్ని వారికే కట్టబెడుతున్నారని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. కనీస మౌలిక వసతులు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. హైటెక్ సిటీ ఏరియాను చూస్తే అమెరికా చూసినట్లు ఉంటుందని కేటీఆర్ అంటున్నారని.. అదే కేటీఆర్ హఫీజ్పేట్ తోపాటు ఇతర ఏరియాలను చూడాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి హితవు పలికారు. కేసీఆర్, కేటీఆర్ ఫ్యామిలీపై పోరాటం బీజేపీకే సాధ్యమన్నారు.