అమ్మఒడి డబ్బులు రావాలంటే.. ఈ రూల్స్ మస్ట్‌?

Chakravarthi Kalyan
జగనన్న అమ్మఒడి 2022–23 పథకం కోసం జగన్ జగన్ ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనల ప్రకారమే ఇకపై అమ్మ ఒడి డబ్బులు వస్తాయి. ఈ నిబంధనల ప్రకారం.. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబానికి చెందిన విద్యార్థులు తల్లులే ఈ  పథకానికి అర్హులు అవుతారు. అలాగే పేదరికంలో ఉన్న కుటుంబాల ఆదాయం గ్రామాల్లో నెలకు రూ.10 వేలు మించకూడదన్నమాట. అలాగే పట్టణాల్లో అయితే కుటుంబ ఆదాయం నెలకు రూ.12 వేలుకు మించకూడదని రూల్స్ చెబుతున్నాయి.

అలాగే ఆదాయపన్ను చెల్లించేవారు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షనర్లు అమ్మఒడి పథకానికి అర్హులు కారు. దీంతో పాటు వ్యవసాయ భూమిలో మెట్ట అయితే 10 ఎకరాలు దాటి ఉంటే అమ్మఒడి రాదు. మాగాణి భూమి 3 ఎకరాల్లోపే ఉండాలి. రెండూ కలిపి ఉంటే 10 ఎకరాలు దాటకూడదు. అలాగే విద్యుత్‌ గరిష్ట వినియోగం నెలకు 300 యూనిట్లు మించకూడదు. పట్టణాల్లో ఇంటి విస్తీర్ణం 1,000 చదరపు అడుగులు మించకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: