జగన్.. హిందూ జోలికొస్తే ఊరుకోను.. పవన్ వార్నింగ్?
హిందూ ధర్మానికేనా? ఇతర మతాలకు అలాగే చేస్తారా అని నిలదీసిన పవన్.. అన్ని మతాలకు సమదూరంలో ఉండాలని రాజ్యాంగం చెబుతోందని గుర్తు చేశారు. వస్తువులు, ప్రసాదాలు, కేశాలపైన వేలం వేయవచ్చుని.. అర్చకులను వేలం వేయడం రాజ్యాంగ విరుద్ధమని.. ఈ విషయాన్ని జనసేన తరఫున కోర్టులో ఛాలెంజ్ చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. ఆలయాలను దుర్వినియోగం చేస్తున్నారని.. హిందూ ధర్మాన్ని అగౌరవపరుస్తున్నారని.. హిందూ ధర్మాన్ని ఆడుకుంటుంటే చూస్తూ ఊరుకోవాలా.. హిందూ ధర్మం విషయంలో పిచ్చి వేషాలు వేయవద్దని పవన్ హెచ్చరించారు.