ఆ ఆంటీ ఖతర్నాక్‌.. అంత డబ్బు నొక్కేసింది..

Chakravarthi Kalyan
విజయనగరం జిల్లా రాజాంలోని సెయింట్ ఆన్స్ స్త్రీ శక్తి పరస్పర సహకార సంఘం లిమిటెడ్ లో మహిళా ఉద్యోగి చేతివాటం ప్రదర్శించింది.. సంఘంలోని 28 గ్రూపులకు సంబంధించిన సుమారు రూ.28 లక్షల కాజేసింది. మహిళ ఉద్యోగి విజయలక్ష్మి.. సంస్థ సభ్యులుకు తెలియకుండా పోర్జరి సంతకాలతో భవానీ గ్రూపు నుండి ఎనిమిది లక్షల రూపాయలు వాడుకుంది.

బ్యాంక్ ఖాతాలకు కట్టవలసిన డబ్బులు సభ్యుల నుంచి తన వ్యక్తిగత ఖాతాకు ఫోన్ పే ద్వారా వేయించుకోని..,  అందులో నుంచి కొంత మొత్తాన్ని మాత్రమే బ్యాంకులో కట్టి మిగతా డబ్బును తన సొంతానికి  వినియోగించుకుంది. మొత్తం 28 గ్రూపు నుంచి సుమారు రూ. 28 లక్షల 78 వేల రూపాయలు విజయలక్ష్మి దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు.  సెయింట్ ఆన్స్ స్త్రీ శక్తి పరస్పర సహకార సంఘం లిమిటెడ్ కోశాధికారి రేజేటి సరోజిని ఫిర్యాదు మేరకు విజయలక్ష్మిపై కేసు నమోదు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: