సీమ బిడ్డగా.. చంద్రబాబు సీమకు చేసిందేంటి?
రాయలసీమలో పోతిరెడ్డిపాడు,ఎస్ఎన్ఎస్, గాలేరు–నగరి ప్రాజెక్టులు ఉన్నా... వీటిలో చంద్రబాబు ఒక్కటైనా ప్రారంభించారా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్టీ రామారావు ఈ ప్రాజెక్టులను డిజైన్ చేశారని.. ఎన్టీఆర్ డిజైన్ చేస్తే..చంద్రబాబు ఎన్టీఆర్ను ఎలా ముంచారో..ఈ ప్రాజెక్టులను కూడా చంద్రబాబు అలాగే ముంచేశారని విమర్శిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 9 ఏళ్లు ఈ ప్రాజెక్టులకు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదని.. వాటిని మూలనపడేశారని గుర్తు చేస్తున్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాకే మళ్లీ ఈ ప్రాజెక్టులకు ప్రెస్గా జీవోలు ఇచ్చి ప్రారంభించారని మంత్రి అంబటి గుర్తు చేశారు.