హైదరాబాద్ మెట్రో ఎండీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు?
కేసీఆర్కు వత్తాసు పలికే అధికారులు రిటైర్మెంట్ అయినా....వాళ్ల సర్వీసులు ఎక్స్ టెన్షన్ చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. వర్షాలతో రాష్ట్రం అంతా...ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంటే హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు రాజకీయాలు చేయడం ఏమిటని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్కుమార్ గౌడ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ కరపత్రాన్ని ఏన్ వీ ఎస్ రెడ్డి చదివారని మహేష్కుమార్ గౌడ్ ఆరోపించారు. రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవంటున్న కేసీఆర్ ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని మహేష్కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు.