గుడ్‌న్యూస్‌: ఇండియా చైనా చర్చల్లో కీలక మలుపు?

Chakravarthi Kalyan
ఇండియా, చైనా సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను నెలకొల్పేందుకు ఇరు దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. తాజాగా ఇండియా-చైనా కార్ప్స్ కమాండర్ స్థాయి 19వ రౌండ్ సమావేశం జరిగింది. ఈ సంయుక్త సమావేశంపై విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. 19వ రౌండ్ ఇండియా-చైనా కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశం 13-14 ఆగస్టు 2023న భారత్ వైపు ఉన్న చుషుల్-మోల్డో సరిహద్దులో మంచి వాతావరణంలో జరిగింది.


పశ్చిమ సెక్టార్‌లోని ఎల్‌ఎసితో పాటు మిగిలిన సమస్యల పరిష్కారంపై ఇరు దేశాలు  సానుకూల, నిర్మాణాత్మక, లోతైన చర్చలు జరిపాయి. సరిహద్దుల్లో పరిస్థితులపై ఇప్పటికే తయారు చేసిన  మార్గదర్శకాలకు అనుగుణంగా  తాజా పరిస్థితులపై రెండు దేశాలు అభిప్రాయాలు మార్పిడి చేసుకున్నాయి. రెండు దేశాల మధ్య మిగిలిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి,  సైనిక,దౌత్య మార్గాల ద్వారా చర్చల వేగాన్ని కొనసాగించడానికి రెండు దేశాలు అంగీకారం తెలిపాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: