కేసీఆర్, తమిళిసై అనుబంధం.. రెండు కళ్లూ చాలట్లేదు?
ఒక్కో అంతస్తు గురించి కేసీఆర్ వివరించారు. తర్వాత గవర్నర్ కు సాంప్రదాయ పద్ధతిలో ఆహ్వానం పలికారు. సీఎం కేసీఆర్ ఆరో అంతస్తులోని తన ఛాంబర్ కి తోడ్కొని వెళ్లి, శాలువాతో సత్కరించి పూల బొకే ఇచ్చారు. అంతే కాదు.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కుంకుమ బొట్టుతో గవర్నర్ తమిళిసైని సాంప్రదాయ పద్ధతిలో సన్మానించారు కూడా. అనంతరం గవర్నర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆతిథ్యం ఇచ్చారు. కాసేపు ఇష్టాగోష్టిగా ఇద్దరూ చర్చించారు. సచివాలయ సందర్శన పూర్తయిన తర్వాత గవర్నర్ తమిళిసైకి ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళి మరీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీడ్కోలు పలికారు.