రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు చంద్రబాబు?

Chakravarthi Kalyan
చంద్రబాబుకు తన జీవితంలోనే అతి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. జీవితంలో ఆయన మొదటిసారి జైలుకు వెళ్లారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. చంద్రబాబు ఈనెల 22 వరకు రిమాండ్‌ ఖైదీగా జైలులో ఉంటారు. అంతకుముందు చంద్రబాబును ఈ కేసు నుంచి బయటపడేసేందుకు సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఎంతో ప్రయత్నించారు. ఏసీబీ కోర్టులో ఎంతగానో వాదించారు.

ఉదయం నుంచి వాదనలు సాగాయి. మధ్యలో గంటపాటు భోజన విరామం ఇచ్చారు. ఆ తర్వాత  మధ్యాహ్నం 1.45 గంటల ప్రాంతంలో వాదనలు మళ్లీ మొదలయ్యాయి. ఆ తర్వాత సుమారు మధ్యాహ్నం 2.30 గంటలకు వాదనలు ముగిశాయి. గంటల తరబడి ఈ వాదనలు జరిగాయి. అయితే.. ఎట్టకేలకు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్‌ విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. గంటకు కోటిన్నర రూపాయలు వెచ్చించి లాయర్ ను పెట్టుకున్నా ఫలితం దక్కలేదు. దీంతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: