వంద రోజుల్లోనే సోనియా గ్యారంటీలు అమలు?
సోనియాగాంధీ తెలంగాణకు రావడంతో బీఆరెస్, బీజేపీ, ఎంఐఎంల ముసుగులు తొలగిపోయాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇచ్చిన హామీలపై చర్చ పెట్టాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కెసిఆర్ కి ఏటీఎం గా మారిన ధరణిని తాము రద్దు చేసి తీరుతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ దోపిడీ పాలనను బొంద పెట్టడం ధరణితోనే మొదలుపెడతామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.