తెలంగాణలో బీజేపీ ఖాయమంటున్న రాజ్‌నాథ్‌?

Chakravarthi Kalyan
కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. తన సభల్లో ప్రజలను చూస్తుంటే తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం అనిపిస్తుందంటూ ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ .. పౌరుషాల గడ్డ.. కళలలను ప్రపంచానికి అందించిన గొప్ప గడ్డ ఇది అంటూ మెచ్చుకున్నారు. ఎంతో మంది పోరాటాల యోదులను కన్న గడ్డ ఇది అన్న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్.. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ కుటుంబం ఏర్పాటు చేయలేదని చెప్పుకొచ్చారు.


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ ఎంతో తోడ్పాటు అందించిందన్న కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్.. తెలంగాణ కోసం నేను జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రాష్ట్ర ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నానని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయితే వేగంగా అభివృద్ధి చెందుతుంది అని భావించామని.. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లు రెండు అభివృద్ధి లో దూసుకు పోవాలని కోరుకున్నామని కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: