మేడిగడ్డ బ్యారేజీకి ప్రమాదం.. రంగంలోకి కేంద్రం?
భారీ ఎత్తున నిధులు కేటాయించి నిర్మించిన ప్రాజెక్ట్ కుంగిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభుత్వం చెప్పాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీసిన ప్రోజెక్ట్ ఇదన్నారు. ఎంతో మంది నిపుణులు చెప్పిన వినకుండా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ను నిర్మించారని... ఇప్పుడు డ్యాం పిల్లర్లు కుంగిపోయిన పరిస్థితి చూస్తున్నామని.. -డ్యాం సేఫ్టీ అథారిటీతో బృందాలతో ప్రాజెక్ట్ ను పరిశీలించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మరి కేంద్రం ఈ ప్రాజెక్టుపై దర్యాప్తు చేయిస్తుందా అన్నది చూడాలి.