మాదిగలు కేసీఆర్కు ఝలక్ ఇస్తారా?
సామాజిక న్యాయాన్ని కాంగ్రెస్, భారాస అమలు చేయలేదని.. సామాజిక న్యాయాన్ని అమలు చేస్తుంది ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరేనన్న మంద కృష్ణ మాదిగ.. మాదిగలను కాపాడే పెద్ద అన్నగా ప్రధాని వచ్చారన్నారు. మొదటిసారి ప్రధాని అయిన మోదీ దళితుడిని రాష్ట్రపతిని చేశారని.. రెండోసారి ప్రధాని అయ్యాక ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేశారని.. కేసీఆర్ మంత్రివర్గంలో 18మంత్రులు ఉంటే ఒక్క మాదిగ మంత్రి లేరని మంద కృష్ణ మాదిగ గుర్తు చేశారు.