మంద కృష్ణ జన్మధన్యం..అందుకే ఆ ఏడుపు?

Chakravarthi Kalyan
ఇటీవల సికింద్రాబాద్‌లో మాదిగల విశ్వరూప సభ జరిగింది. ఈ సభకు సాక్షాత్తూ ప్రధాన మంత్రి వచ్చారు. ఎస్సీల వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని.. దీనిపై కమిటీ వేస్తామని.. కోర్టుల్లోనూ న్యాయం జరిగేలా చూస్తామని ప్రధాని మోదీ అన్నారు. అయితే.. అంత కంటే ఎక్కువగా ఆయన మంద కృష్ణ మాదిగను పొగిడారు. వన్‌ మేన్‌ వన్‌ ఎజెండాగా మంద కృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారని కితాబిచ్చారు.

తాను సైతం మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో పని చేస్తానని.. చెప్పడం నిజంగా మంద కృష్ణ మాదిగ జన్మ ధన్యం అయినట్టే భావించినట్టున్నారు. అందుకే మోదీ ప్రసంగిస్తున్నంత సేపు మంద కృష్ణ మాదిగ కంటనీరు పెట్టుకున్నారు. ఆయన దశాబ్దాల తరబడి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు దాన్ని మోదీ సాకారం చేస్తానని చెప్పడం కూడా ఆ కన్నీరుకు ఓ కారణంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: