మళ్లీ కేసీఆర్ వస్తే.. పేద విద్యార్థుల గతి అంతే?
ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థుల ఫీజులు పెరుగుతున్నాయి కానీ....ఫీజు రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్లు నేటికి పెంచలేదని తెలంగాణ ఇంజనీరింగ్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు శరణ్కుమార్ మండిపడ్డారు. ఇంజనీరింగ్లో నేటికి పాత సిలబస్నే కొనసాగిస్తుండంతో చాలా మంది విద్యార్థులు ఉద్యోగాలు లేక రోడ్లపై తిరుగుతున్నారని తెలంగాణ ఇంజనీరింగ్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు శరణ్కుమార్ అన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నిసార్లు కేసీఆర్, కేటీఆర్ కలిసిన న్యాయం జరగలేదని.. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఇంజనీరింగ్ విద్యార్థుల కుటుంబాలు అందరూ బుద్ది చెప్పాలని తెలంగాణ ఇంజనీరింగ్ స్టూడెంట్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు శరణ్కుమార్ విజ్ఞప్తి చేశారు.