
రైతుబంధు ఆపిన పాపం కాంగ్రెస్దేనా?
కాంగ్రెస్ పార్టీని నిందిస్తూ రైతుబంధుపై తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని మల్లిఖార్జున ఖర్గే అంటున్నారు. ఎన్నికల సమయంలో రైతుబంధు పంపిణీని ఎన్నికల సంఘం అడ్డుకుందని.. లబ్దిదారులకు రైతుబంధు డబ్బులు బదిలీ చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరిందన్నారు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఆ పని చేయలేదని ఆరోపించిన మల్లి ఖార్జున ఖర్గే... కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.