ఓటమి భయంతో కేసీఆర్ అంతపని చేస్తున్నారా?
ఇవాళ ఛీఫ్ ఎలక్షన్ అధికారి వికాస్ రాజ్ ను కలవనున్న టీ కాంగ్రెస్ నేతలు దీనిపై ఫిర్యాదు చేయనున్నారు. ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని ఇటు హైదరాబాద్ లో అటు ఢిల్లీ లో ఎన్నికల సంఘం, ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తామని.. ఇదే అంశాన్ని జూమ్ మీటింగ్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. తాను , భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, తదితరులు ఈసీ ని కలుస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు.