దేవుళ్ల బాటలో చంద్రబాబు..?
ఈ ఉదయం 10గం. కు సతీసమేతంగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని చంద్రబాబు దర్శించుకోనున్నారు. అలాగే రేపు సింహాద్రి అప్పన్నను సతీ సమేతంగా దర్శించుకోనున్నారు. ఆ తరవాత ఈనెల 5న శ్రీశైలం మల్లన్నను చంద్రబాబు దర్శించుకోనున్నారు. అంతే కాదు.. ఆ తర్వాత వీలును బట్టి కడప అమీన్ పీర్ దర్గా, గుణదల మేరీమాత చర్చిలను కూడా చంద్రబాబు దర్శించుకోనున్నారు. మొత్తానికి జగన్ సర్కారు పెట్టిన వరుస కేసుల కారణంగా మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడిన చంద్రబాబు.. ఇప్పుడు కాస్త ఊరట చెందుతున్నారు.