బీజేపీ కష్టం.. కాంగ్రెస్కు కలసి వచ్చిందా?
అయినప్పటికీ కేసీఆర్ మూర్ఖత్వపు పాలన పీడ విరగడైనందుకు మాకు చాలా సంతోషంగా ఉందంటున్న బీజేపీ నేతలు.. కేటీఆర్ అధికారంలో ఉన్నన్నాళ్లు మీడియాకు విలువ ఇవ్వలేదని..అహంకారంతో విర్రవీగారని.. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చేసరికి ఎక్కడ లేని గౌరవం ఇస్తున్నారని అంటున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి, మెజారిటీ సీట్లు సాధించిన రేవంత్ రెడ్డికి ఆ పార్టీ అభినందనలు చెబుతోంది. బీజేపీ గ్రాఫ్ తగ్గించేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేశారని..ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి లాభపడాలని చూశారని.. కానీ చివరకు బీఆర్ఎస్ ఓడిందని వారు అంటున్నారు.