నిజమా..? ఏపీలో దొంగఓట్లు చేర్పిస్తున్నారా?
చాలమందికి రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయని.. వాటిని తొలగించాలని ఈసీని కోరామని.. ఎవరికైనా సరే ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలని వైసీపీ మంత్రులు పేర్కొన్నారు. హైదరాబాద్, ఏపీలో 4 లక్షల 30 వేల 264 ఓట్లు ఉన్నాయని... ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్కు అందించామని... డబుల్ ఎంట్రీలు తొలగించాలని సీఈవోను కోరామని... దేశంలో ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ విధానమని వైసీపీ మంత్రులు తెలిపారు.