ఆ ఆస్తుల లిస్టు తయారు చేయండి.. మంత్రిగారి ఆదేశం?

Chakravarthi Kalyan
అన్ని కార్పొరేషన్ల ఆస్తుల జాబితా సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలను రైతులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు... త్వరలోనే కార్పొరేషన్ల పనితీరుపై మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పాత పద్దతులకు స్వస్తిపలికి సరికొత్త విధానాలతో రైతులోకానికి ఉపయుక్తంగా ఉండేలా కార్యాచరణ చేపట్టేలా కార్పొరేషన్లు పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తేల్చి చెప్పారు.

ప్రతి కార్పొరేషన్ సరికొత్త సాంకేతిక అందిపుచ్చుకుని సమర్థంగా పనిచేసేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు అందిపుచ్చుకుని సక్రమమైన పద్దతుల్లో అమలు పరిచేలా కార్పొరేషన్లు బాధ్యత తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ దిశగా ఇప్పటి వరకు కార్పొరేషన్లు చేసిన కృషి ఏంటో పూర్తి నివేదిక సమర్పించాలని ఆయా కార్పొరేషన్ల అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: